యేసుక్రీస్తు వారి పరిచర్యతో సంబంధమున్న ప్రాంతాలు
పెరయ -
దీనిని బైబిల్ లో ఇలా పిలిచారు "యొర్దాను అద్దరినున్న యూదయ ప్రాంతము",
యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తరువాత... గలిలయనుండి యొర్దాను అద్దరినున్న యూదయ ప్రాంత ములకు వచ్చెను.- మత్తయి 19:1
గలీలయ నుండి యూదయాకు వెళ్లేవారు సమరయను తప్పించుకోడానికి పెరయా గుండా వెళ్తారు, ఈ ప్రాంతములో యేసువారు చేసిన పరిచర్య గురించి లూకాగారు ఎక్కువగా తన సువార్తలో పొందుపరచారు, - లూకా. 9:51-18:30,
ఇదే ప్రాంతములో బాప్తిస్మమిచ్చు యోహాను తాను ఐనోనుకు రాక ముందు పరిచర్య చేసాడు, ఆయన యోర్దను దగ్గర నున్న బేతనియలో బాప్తిస్మము ఇచ్చినట్లుగా వ్రాయబడింది.
యోహాను బాప్తిస్మమిచ్చుచున్న యొర్దానునదికి ఆవలనున్న బేతనియలో ఈ సంగతులు జరిగెను. - యోహాను 1:28
గనుక వారు యోహాను నొద్దకు వచ్చి బోధకుడా, యెవడు యొర్దానుకు అవతల నీతో కూడ ఉండెనో, నీవెవనిగూర్చి సాక్ష్యమిచ్చితివో, యిదిగో, ఆయన బాప్తిస్మ మిచ్చుచున్నాడు; అందరు ఆయనయొద్దకు వచ్చుచున్నారని అతనితో చెప్పిరి. - యోహాను 3:26యొర్దాను అద్దరిని యోహాను మొదట బాప్తిస్మమిచ్చుచుండిన స్థలమునకు ఆయన తిరిగి వెళ్లి అక్కడనుండెను.- యోహాను 10:40
అయితే ఈ బేతనియ, మార్త, మరియల బేతనియ ఒకటి కాదు, యోర్దను దగ్గర ఉన్నది పెరయకు సంబందించినది . యేసయ్య అదే సమయంలో కొంతకాలం అక్కడ పరిచర్య చేసి, అక్కడ నుండి గలీలయకు వెళ్ళిపోయాడు, తర్వాత మరల యోహాను 10:40, లూకా 9:51- 18:30లో వ్రాయబడినట్టు యేసుక్రీస్తు వారు మరల ఈ ప్రాంతములో సేవ చేయడానికి తిరిగి వచ్చాడు,
ఈ ప్రాంతము మొదట్లో మహా హేరోదు పరిపాలన క్రింద ఉండేది, ఆయన తన రాజ్యమును తన కుమారులకు పంచి ఇచ్చిన తర్వాత అది హేరోదు అంతిప చేతి క్రిందకు వెళ్ళింది. యోర్దానుకు అద్దరినున్న గోత్రముల (రూబేను, గాదు, మనష్షే అర్ధ గోత్రపువారు) వారు, ఈ ప్రాంతములో దక్షిణ భాగములో ఉన్నారు అనేది బైబిల్ పండితుల అభిప్రాయం
మరియు రూబేనీయులకును గాదీయులకును మనష్షే అర్ధగోత్రపువారికిని యెహోషువ యీలాగు ఆజ్ఞా పించెను. - యెహోషువ 1:12
కాబట్టి రూబేనీయులును గాదీయులును మనష్షే అర్ధ గోత్రపువారును యెహోవా మోషే ద్వారా సెలవిచ్చిన మాట చొప్పున తాము స్వాధీనపరచుకొనిన స్వాస్థ్య భూమియైన గిలాదులోనికి వెళ్లుటకు కనాను దేశమందలి షిలోహులోనున్న ఇశ్రాయేలీయుల యొద్దనుండి బయలుదేరిరి. కనాను దేశమందున్న యొర్దాను ప్రదేశమునకు వచ్చినప్పుడు - యెహోషువ 22:9
యెహోషువ. 1:12-14, యెహోషువ. 22:9 ని బట్టి పాత నిబంధనలోని గిలాదు అనే ప్రాంతమును ఇలా పిలిచారు అని కొంతమంది పండితుల అభిప్రాయం.
ఎఫ్రాయిము-
ఇది యెరూషలేముకు ఉత్తర తూర్పుగా 12 మైళ్ళ దూరంలో ఉన్నది. ఈ ప్రాంతముకు దగ్గరలో అబ్షాలోము తన గొర్రెల బొచ్చు కత్తిరించుకున్నాడు
రెండు సంవత్సరములైన తరువాత ఎఫ్రాయిమునకు సమీపమందుండు బయల్దాసోరులో అబ్షాలోము గొఱ్ఱెల బొచ్చు కత్తిరించుకాలము రాగా అబ్షాలోము రాజకుమారుల నందరిని విందునకు పిలిచెను. -2 సమూయేలు 13:23
బేతనియ -
బేతనియ (కష్టాల ఇల్లు) అనేది ఓలివ కొండ మీద తూర్పు వాలున ఉన్న ఒక గ్రామం, ఇక యెరూషలేముకు తూర్పుగా 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నది (యోహాను. 11:18).
అనాతోతులోను నోబులోను అనన్యాలోను - నెహెమ్యా 11:32
బేత్పగే
దీనికి అత్తి ఇల్లు- fig house అని అర్ధం .
- ఆర్. సమూయేలు.

కామెంట్ను పోస్ట్ చేయండి